ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్స్ ఏపీకి ప్రధాని రాకతో గట్టిగానే న్యాయం జరిగింది.. ఏకంగా రూ. 13,429 కోట్లు, ఆ జిల్లాల దశ తిరిగింది


 

PM MODI INAUGURATES RS 13429 CRORE WORKS IN ANDHRA PRADESH: ఆంధ్రప్రదేశ్‌లో రూ. 13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. కర్నూలులో జరిగిన కార్యక్రమంలో భాగంగా పారిశ్రామిక కారిడార్లు, విద్యుత్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలు, రైల్వే లైన్లు, రోడ్లు, గ్యాస్ పైప్‌లైన్‌లు వంటి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో భారీగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధాని కర్నూలులో జరిగిన 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్' సభా వేదిక నుంచి ఏకంగా దాదాపు రూ. 13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పనులలో పారిశ్రామిక కారిడార్లు, విద్యుత్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలు, రైల్వే లైన్లు, రోడ్లు, పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రాలు, గ్యాస్ పైప్‌లైన్‌లు వంటివి ఉన్నాయి. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యం. 5 అభివృద్ధి పనులకు రూ. 9449 కోట్లతో శంకుస్థాపనలు చేశారు. అలాగే ప్రధాని మోదీ రూ. 1704 కోట్ల విలువైన 8 అభివృద్ధి పనులను ప్రారంభించి, రూ. 2276 కోట్ల విలువైన 2 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు చేసిన పనుల వివరాలు ఇలా ఉన్నాయి.

పీలేరు కలసూర్ నాలుగు లేన్ల రోడ్ రూ. 593 కోట్లు, నిమ్మలూరులో బెల్లో అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ గ్లాసుల ఉత్పత్తి కేంద్రం రూ. 362 కోట్లు,కడప నెల్లూరు చునియంపల్లి రోడ్లు రూ. 286 కోట్లు. చిత్తూరులోని ఇండేన్ బాట్లింగ్ ప్లాంట్ రూ. 200 కోట్లు.రేణిగుంట కడప మదనపల్లె రోడ్డు రూ. 82 కోట్లు.గుడివాడ నూజెండ్ల వద్ద 4లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి – రూ. 98 కోట్లు.కనిగిరి బైపాస్ రోడ్ రూ. 70 కోట్లు.కల్యాణదుర్గం రాయదుర్గం మొలకలమూరు రోడ్డు రూ. 13 కోట్లు.

ప్రధాని జాతికి అంకితం,ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేసిన పనుల వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళంఅంగుల్ నాచురల్ గ్యాస్ పైప్‌లైన్ రూ. 1730 కోట్లు.కొత్తవలస కొరాపుట్ రైల్వే డబ్లింగ్ పనులు రూ. 546 కోట్లు,ఓర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ రూ. 4922 కోట్లు విద్యుత్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ రూ. 2886 కోట్లు,సబ్బవరం షీలానగర్ జాతీయ రహదారి రూ. 964 కోట్లు కొత్త వలస విజయనగరం మధ్య 4వ లైన్ రూ. 493 కోట్లు పెందుర్తి సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్ రూ. 184 కోట్లు.