ఏపీ ఉచిత బస్సు పథకం.. ప్రభుత్వం ఓసారి ఆలోచించాలి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..


 

ANDHRA PRADESH, AMRAVATI:ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, అప్పుల ఊబిలోకి  ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్యంపై దృష్టి సారించాలని, రాజకీయ ప్రయోజనాల కోసం ఉచితాలు ఇవ్వడం సరికాదని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, చట్టబద్ధతకు ఆయన పలు సూచనలు చేశారు.

ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్న స్త్రీ శక్తి పథకంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాల ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాలు అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయన్నారు. ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఇస్తున్నప్పుడు ప్రజలు తీసుకోవడంలో తప్పలేదని.. ఎవరూ ఉచిత పథకాలను వద్దని చెప్పరన్నారు. 'చేపలు పట్టడం నేర్పించాలి కానీ.. చేపలు తీసుకొచ్చి ఉచితంగా ఇవ్వకూడదు' అంటూ ఉచిత పథకాలను ఉద్దేశించి వ్యాఖ్యనించారు. ఉచితాలు అనుచితంగా తయారయ్యాయని.. పరిమితుల దాటాయన్నారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఉచిత పథకాలను అమలు చేయడం అలవాటుగా మారిందన్నారు. ఈ ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ప్రమాదంలో పడిందని.. ప్రభుత్వాలు పరిమితికి మంచి అప్పులు చేయాల్సి వస్తోందన్నారు.

ఏపీతో పాటుగా ఆయా రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన ప్రయోజనం ఏంటి అని ప్రశ్నించారు. విద్య, వైద్యంపై ఖర్చు చేయాలి కానీ ఉచితాలు అలవాటు చేయకూడదన్నారు. విద్య వల్ల పేదవాడు సంపన్నులయ్యే అవకాశాలు ఉన్నాయని.. వైద్యం ప్రతి మనిషికి అవసరమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శ్వేత పత్రం రూపంలో ప్రజలకు తెలియపరచాలని.. ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు.. ఎంత తిరిగి చెల్లిస్తున్నారు అన్నది ప్రకటించాలన్నారు. ఉచితాలు, అప్పులు పరిధులు దాటుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అప్పులు తెచ్చేటప్పుడు, వాటిని ఎలా తీరుస్తారో అసెంబ్లీలో చర్చించాలని ఆయన కోరారు. ఇది ప్రజలకు జవాబుదారీతనాన్ని పెంచుతుందన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన స్పష్టం చేశారు.

ప్రజాప్రతినిధులు ఒక పార్టీ నుంచి గెలిచి, మరో పార్టీలోకి మారినప్పుడు.. వారు ఆ పార్టీ ద్వారా పొందిన పదవికి రాజీనామా చేయాలన్నారు వెంకయ్య. 10వ షెడ్యూల్‌ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో)ను సవరించాలని సూచించారు. పార్టీ ఫిరాయింపులతో మంత్రులు అవుతున్నారన్నారు. చట్టసభల్లో కుటుంబ సభ్యులపై దూషణలు సరికాదని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశ కీర్తిని అందరూ చాటాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధుల క్రిమినల్ కేసుల విచారణ రెండేళ్లలోపు పూర్తి చేయాలని, ప్రభుత్వాలు కోర్టుల సంఖ్యను పెంచి, న్యాయమూర్తులను నియమించాలని ఆయన సూచించారు. రాజకీయ వారసత్వాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అర్హత ఉన్నవారికే రాజకీయాల్లో అవకాశం దక్కాలని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడికి ప్రయత్నించడాన్ని వెంకయ్య నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ దాడి యత్నం కేవలం ప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన విషయం కాదని.. ఇది మొత్తం సమాజానికి, న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశమన్నారు. ప్రధాన న్యాయమూర్తి వంటి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిపై దాడి యత్నం జరగడం దేశానికి మంచిది కాదని.. మరోసారి ఇలాంటివి జరగకుండా దాడికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.