రెండు మంత్రి పదవుల కోసం ఇలా చేస్తారా.. కచ్చితంగా ఇది ద్రోహమే: విజయ్ కేబినెట్‌పై విజయసాయిరెడ్డి


 

India Tamilnadu : తమిళనాడులో మే 10వ తేదీన ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు తొమ్మిది మంది మాత్రమే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 23 మందికి మంత్రులుగా టీవీకే పార్టీ అధినేత విజయ్ అవకాశం ఇచ్చారు. ఈ కేబినెట్ కూర్పు, ప్రమాణ స్వీకారంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ రాజకీయాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తు్న్నారు. ఏపీ రాజకీయాలు, కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, దేశంలో ఇంధన కొరత, ఏపీ రాజధాని అమరావతి, తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి కావడం.. ఇలా ప్రతి అంశంపై తన అభిప్రాయాలను చెప్పుకొస్తున్నారు. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ఘన విజయం తర్వాత నుంచి తాజాగా అక్కడ మంత్రివర్గం ప్రమాణస్వీకారం వరకు అంశాల వారీగా స్పందించారు. తాజాగా విజయ్ కేబినెట్‌లో కాంగ్రెస్ చేరడం.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంపై విజయసాయిరెడ్డి స్పందించారు.

తమిళనాడులో ఇవాళ నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం చూస్తే కాంగ్రెస్‌వాళ్ల తీరు ఎలా ఉందో అర్ధమవుతుంది. తన పాత పాత మిత్రపక్షాలలో ఒకదానితో బంధాన్ని తెంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయించుకుందో గుర్తుచేసే విధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో డీఎంకే కాంగ్రెస్‌కు అండగా నిలుస్తోంది.. కేవలం రెండు రాష్ట్ర మంత్రి పదవుల కోసం తన చిరకాల మిత్రపక్షమైన డీఎంకేతో సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించుకుంది. రాజకీయాలు అధికారం గురించే కావచ్చు, కానీ పొత్తులకు నమ్మకం, విధేయత కూడా అవసరం. ఇది "మహా తమిళనాడు ద్రోహం" అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విజయ్ కేబినెట్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరడంపై విజయసాయిరెడ్డి స్పందించారు.

మరోవైపు దేశవ్యాప్తంగా ఈ తీవ్రమైన వేడిగాలుల తీవ్రత కనిపిస్తోంది. కేవలం మూడేళ్లలో సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు రానున్నాయి. ఈ వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలోనే జరగనున్నాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు నిలకడగా 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ర్యాలీలు, సభలు, రాజకీయ ప్రచారాల కోసం లక్షలాది మంది ప్రజలు గుమిగూడతారనే అంచనాలు ఉంటాయి. ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఆందోళన కలిగిస్తోంది. ఓటర్ల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్‌ను కొన్ని నెలలు ముందుకు జరపడాన్ని పరిశీలించాలని కేంద్రం ఎన్నికల సంఘం, ప్రధాని మోదీని నేను విజ్ఞప్తి చేస్తున్నాను' అన్నారు విజయసాయిరెడ్డి.